ఎయిర్ టెల్ మరోసారి బాదుడు.. నెలవారీ కనీస రీచార్జ్ రూ.155!

By udayam on November 23rd / 5:41 am IST

ఎయిర్​ టెల్​ తమ వినియోగదారులపై మరోసారి ఛార్జీల భారాన్ని మోపింది. ఇకపై నెలవారీ కనీస రీచార్జ్​ ధరను రూ.155గా పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఆ నెట్​ వర్క్​ లో కనీస నెలవారీ ప్రీపెయిడ్​ రీఛార్జ్​ రూ.99గా ఉంది. అయితే ఈ ప్లాన్​ ను తొలి విడతగా హర్యానా, ఒడిశా సర్కిళ్లలో ఎత్తేసిన ఆ సంస్థ దాని స్థానంలో రూ.155 రీఛార్జ్​ ప్లాన్​ ను ప్రకటించింది. ఇక్కడ పరిశీలించిన తర్వాత రూ.99 ప్లాన్​ ను దేశవ్యాప్తంగా తొలగించి దాని స్థానంలో రూ.155 ప్లాన్​ ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

ట్యాగ్స్​