భారత టెలికాం దిగ్గజ సంస్థ అయిన ఎయిర్టెల్ 5జి సేవలకి సిద్ధమైనట్లు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్లో తొలిసారిగా 5జి కమర్షియల్ సర్వీస్ను పరీక్షించినట్లు వెల్లడించింది.
దీంతో దేశంలో తొలిసారిగా 5జి సేవల్ని పరీక్షించిన సంస్థ తమదేనని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 5జి స్పెక్ట్రమ్ వేలం తర్వాత, ఈ సేవలకు అనుమతులు ఇవ్వగానే తమ వినియోగదారులకు ఈ సేవల్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఎయిర్టెల్ సిఇఓ గోపాల్ విట్టల్ వెల్లడించారు.
ఈ 5జి సేవల్ని పరీక్షించడం కోసం హైదరాబాద్ ప్రాంతంలో ఇప్పటికే తమ వద్ద 1800 ఎంహెచ్జెడ్ స్పెక్ట్రమ్ను వినియోగించామని వెల్లడించింది.
దీంతో ఈ ప్రాంతంలోని యూజర్లు తమ 5జి ద్వారా కేవలం సెకండ్ల వ్యవధిలోనే ఫుల్ హెచ్ సినిమాను తమ మొబైల్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకునే అవకాశం దక్కనుందని వెల్లడించింది.
తమ 5జి నెట్వర్క్ వల్ల 10 శాతం అత్యధిక స్పీడుతో పాటు, 10 వేగవంతమైన నెట్వర్క్తో పాటు 100 శాతం అత్యంత ఖచ్చితత్త్వమైన సిగ్నల్ లభిస్తుందని వెల్లడించింది.