భారత టెస్ట్ ప్లేయర్లు పుజారా, రహానేల కాంట్రాక్టులపై బిసిసిఐ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ప్రస్తుతం గ్రూప్ ఎ కాంట్రాక్ట్లో ఉన్న ఈ ప్లేయర్లను డిమోట్ చేస్తూ గ్రేడ్ బి తగ్గించాలని నిర్ణయించింది. గత కొన్నేళ్ళుగా టెస్టుల్లో విఫలమవుతూ వస్తున్న ఈ ప్లేయర్లపై మాజీలు కూడా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి బదులు కొత్త ప్లేయర్లను గ్రేడ్ ఎ కాంట్రాక్టులు ఇచ్చి ప్రోత్సహించడానికి బిసిసిఐ సిద్ధమవుతోందని సమాచారం.