బెంగళూరు- విశాఖపట్నం మధ్య డిసెంబరు 10 నుంచి ఆకాశ ఎయిర్ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. భారత వారెన్ బఫెట్ గా పేరొందిన రాకేష్ ఝన్ ఝన్ వాలాకు చెందిన ఈ కంపెనీ ఇటీవలే తన కార్యకలాపాలను మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే రోజూ రెండు విమాన సర్వీసులను బెంగళూరు–విశాఖ నగరాల మధ్య నడపడానికి సిద్ధమైంది. మొదటి సర్వీసు డిసెంబరు 10న, రెండో సర్వీసు 12 నుంచి అందుబాటులోకి రానున్నాయి.