ముస్లింలకు అల్​ ఖైదా పిలుపు: భారత ఉత్పత్తుల్ని బ్యాన్​ చేయండి

By udayam on December 28th / 5:04 am IST

భారత ఎంపీ నూపూర్​ శర్మ ముస్లింలపై గతంలో చేసిన వ్యాఖ్యలపై అల్​ ఖైదా తాజాగా మరోసారి స్పందించింది. అరబ్​ దేశాలలోని ముస్లింలు భారత ఉత్పత్తులను బ్యాన్​ చేయాలని, అరబ్​ దేశాల నుంచి భారతీయ పనివాళ్ళను వెనక్కి పంపాలని డిమాండ్​ చేసింది. ముస్లింలు, ఇస్లామిక్​ దేశాలు ఈ విషయంలో కలసికట్టుగా భారత్​ కు వ్యతిరేకంగా పనిచేయాలని పిలుపునిచ్చింది. కశ్మీర్​ వ్యాలీలోని ముస్లింలకు అండగా ఉండాలని కూడా అల్​ ఖైదా మీడియా తన ప్రకటనలో పేర్కొంది.

ట్యాగ్స్​