రూ.2 లక్షల కోట్లు కోల్పోయిన అలీబాబా

By udayam on May 5th / 7:27 am IST

అలీబాబా అధినేత జాక్​ మా ను చైనా పోలీసులు అరెస్ట్​ చేయనున్నారన్న వార్తల నేపధ్యంలో.. ఈ సంస్థ రూ.2 లక్షల కోట్ల మార్కెట్​ వాల్యూను కోల్పోయింది. కంపెనీ షేర్లు నిమిషాల వ్యవధిలో 10 శాతం మేర నష్టపోవడంతో ఈ భారీ నష్టాన్ని చవి చూసింది. అయితే జాక్​ మా ను పోలీసులు అరెస్ట్​ చేయట్లేదని చైనా మీడియాలో వార్తలు వచ్చాయి. కేవలం అదొక రూమర్​ మాత్రమేనని గ్లోబల్​ టైమ్స్​ ప్రకటించింది. మా అనే ఇంటిపేరున్న వ్యక్తిని అరెస్ట్​ చేశారని.. అతడు జాక్​ మా కాదని పేర్కొంది.

ట్యాగ్స్​