సైక్లోన్ అసాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ ఎయిర్పోర్ట్ పూర్తిగా మూతబడింది. తుపాను వైజాగ్ వద్దనే తీరం దాటనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో అన్ని ఫ్లైట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇండిగో, ఎయిర్ఇండియా, స్పైస్జెట్, ఎయిర్ ఏషియా ఫ్లైట్లు విశాఖకు రాక,పోకలను నిలిపివేశాయి. సోమవారం నాడు సైతం విశాఖలో ఏర్పడ్డ వాతావరణ మార్పుల కారణంగా పలు ఫ్లైట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.