టాలీవుడ్ లో లెక్కలు మారుతున్నాయి. కుర్ర హీరోలందరిదీ ఇప్పుడు పాన్ ఇండియా బాటే. ఇప్పటికే పుష్ప మూవీతో ఆ స్థాయికి చేరుకున్న అల్లు అర్జున్ కూడా.. తన తర్వాతి చిత్రాలను కూడా అదే కోవలో తెరకెక్కించడానికి సరైన డైరెక్టర్లను వెతుకుతున్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్లలో ఒకడైన సురేందర్ రెడ్డిని అతడు లైన్ లో పెట్టాడని టాక్ నడుస్తోంది. ఇప్పటికే అఖిల్ తో ‘ఏజెంట్’ ను పూర్తి చేసిన సురేందర్ కూడా బన్నీ ఇచ్చిన ఆఫర్ ను ఉపయోగించుకోవాలని కథను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.