అమర రాజా గ్రూపుకు చెందిన అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ తెలంగాణలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. ఆ మేరకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు అమర రాజా సంస్థ ప్రకటించింది. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో భారీ లిథియం-అయాన్ బ్యాటరీ పరిశోధన, తయారీ సంస్థను ప్రారంభించనున్నట్టు ఆ సంస్థ తెలిపింది. వచ్చే పదేళల్లో ఈ పరిశ్రమపై రూ. 9500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్టు అమర రాజా బ్యాటరీస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ ప్రకటించారు.
Yet another historic win for Telangana
Amara Raja to setup India's largest Lithium Ion Cell Manufacturing facility till date with an investment of ₹9,500 Cr, further reinforcing Telangana’s position as an ideal destination for EV and Advanced Cell Chemistry (ACC) Manufacturing. pic.twitter.com/z0h5BlwUyz
— KTR (@KTRTRS) December 2, 2022