వ్యయ నియంత్రణలో భాగంగా భారీ ఎత్తున ఉద్యోగాలు తొలగించేందుకు సిద్ధమైన అమెజాన్ ఇండియా ఈ క్రమంలో మరో ప్రకటన చేసింది. భారత యువత కోసం ఇదివరకే తీసుకొచ్చిన ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫాం ను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. భారత్లో హైస్కూల్ విద్యార్థుల కోసం దీనిని ప్రారంభించగా ఎటువంటి కారణం వెల్లడించకుండానే మూసివేత గురించి ప్రకటించింది. ఇటీవలే భారత్ లోని కొందరు ఉద్యోగులను స్వచ్ఛందంగా ఉద్యోగాల నుంచి తప్పుకోవాలని ఈ కంపెనీ మెయిల్స్ పంపిన సంగతి తెలిసిందే.