ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు తీవ్రం అవుతున్న దశలో కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది. జపాన్, చైనా, అమెరికా, కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడంతో ప్రతీరోజూ వచ్చే అన్ని పాజిటివ్ శాంపిల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించేందుకు గానూ జీనోమిక్స్ కన్సార్టియం జీనోమ్ సీక్వెన్సింగ్ లేబొరేటరీస్ కు పంపాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శ ఆదేశాలు జారీ చేశారు.