షా : 18 ఏళ్ళు నిండితే ఆటోమేటిక్​గా ఓటర్​ కార్డ్​

By udayam on May 10th / 6:13 am IST

దేశవ్యాప్తంగా జనగణనను ఈసారి డిజిటల్​ పద్దతిలో చేపట్టనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ప్రకటించారు. జనన, మరణ ధృవీకరణ పత్రాలను నేరుగా డిజిటల్​ సెన్సస్​కు అనుసంధానం చేస్తామన్న ఆయన దీనికోసం ప్రత్యేక సాఫ్ట్​వేర్​ను తీసుకొస్తున్నట్లు చెప్పారు. 18 ఏళ్ళు నిండిన వారికి ఆటోమేటిక్​గా ఓటర్​ గుర్తింపు కార్డులు జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని 2024 నాటికి పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్​