కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడంపై మంగళవారం చెలరేగిన అల్లర్లు హింసారూపం దాల్చాయి. నిరసనకారులు రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్ళకు నిప్పు పెట్టారు. దీంతో పాటు ఇక్కడే పార్క్ చేసి ఉన్న 3 ఆర్టీసీ బస్సులను సైతం ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. ఆపై నిరసనకారులు రాళ్ళు రువ్వడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ‘కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు’ అంటూ వారు నినదించారు.
#Konaseema 🔥🔥🔥🔥🇮🇳
Only Konaseema 🔥🔥#Amalapuram pic.twitter.com/T1Sv4WZ8e3
— Maxx C (@MaxxCHere) May 24, 2022