సిఎస్​ పదవీకాలాన్ని మళ్ళీ పొడిగించిన ఎపి

By udayam on May 14th / 5:13 am IST

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర చీఫ్​ సెక్రటరీ డాక్టర్​ సమీర్​ శర్మ పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మే 31న ఆయన పదవీ విరమణ పొందాల్సి ఉండగా.. ప్రభుత్వం ఎక్స్​టెన్షన్​ ఇచ్చింది. దీంతో ఆయన ఈ పదవిలో ఈ ఏడాది నవంబర్​ 30 వరకూ కొనసాగనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం కూడా అంగీకారం తెలిపింది. గతేడాది అక్టోబర్​ లో అప్పటి సిఎస్​ ఆదిత్యనాథ్​ దాస్​ నుంచి బాధ్యతలు తీసుకున్న ఆయన గతేడాది నవంబర్​ 30నే పదవీ విరమణ చేయాల్సి ఉంది.

ట్యాగ్స్​