ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర వేసింది. వీటిల్లో రూ.81 వేల కోట్ల పెట్టుబడులు కేవలం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లోనే వివిధ కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటితో పాటు రాష్ట్రంలో 51 జాతీయ రహదారులను కూడా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద రెండో ఫ్లై ఓవర్ కోసం రూ.21,560 కోట్ల కేంద్ర పెట్టుబడులను రాష్ట్రం సాధించింది. వీటితో పాటు మరో 3 గ్రీన్ ఫీల్డ్ హైవేలతో పాటు 30 రోడ్ ఓవర్ బ్రిడ్జిలను కేంద్రం నుంచి దక్కించుకుంది.