దావోస్లో ఎపి తన పెట్టుబడుల వేట కొనసాగిస్తోంది. సిఎం జగన్ మోహన్ రెడ్డి స్వయంగా అక్కడే ఉంటూ పెట్టుబడిదారులతో మాట్లాడి రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులను తీసుకురావడానికి కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా అరబిందో రియల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎపిలో 6 వేల మె.వాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ముందుకొచ్చింది. దీంతో పాటు గ్రీన్ కో సంస్థ సైతం ఎపిలో 8 వేల మె.వాట్ల కర్బన రహిత ఉత్పత్తికి ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలు కలిపి రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.
దావోస్:6వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పదం కుదుర్చుకున్న అరబిందో రియాల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్లిమిటెడ్. ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, అరబిందో తరఫున కంపెన్ డైరెక్టర్ పి.శరత్ చంద్రారెడ్డి సంతకాలు. pic.twitter.com/ee3nms8fVG
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 24, 2022