ఆంధ్రప్రదేశ్ తీర నగరం విశాఖ లో జరగనున్న ప్రపంచ పెట్టుబడుల సమావేశానికి ఏపీ సర్కార్ ప్రపంచ ప్రఖ్యాత బిలియనీర్లు ఎలన్ మస్క్ (టెస్లా), జెఫ్ బెజోస్ (అమెజాన్), టిమ్ కుక్ (యాపిల్) లకు ఆహ్వానాలు పంపింది. వీరితో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచయ్, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ సత్య నాదెళ్ళకూ ఆహ్వానాలు వెళ్ళాయి. మార్చి 3–4 తేదీల్లో జరిగే ఈ సమావేశానికి 15 రాష్ట్రాల సిఎంలు, 44 మంది ప్రపంచ స్థాయి వ్యాపారవేత్తలు, భారత్ నుంచి 53 మంది బడా వ్యాపారవేత్తలు, 15 మంది కేంద్ర మంత్రులు, వివిద దేశాలకు చెందిన రాయబారులు హాజరుకానున్నారు.