ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటి రాకతో ప్రభుత్వానికి ఏటా రూ.3 వేల కోట్ల ఆదాయంతో పాటు 10 వేల ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో జరిగిన ఎస్ఐపిబి మీటింగ్లో ఆయన ఈ పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. వీటిల్లో 3,700 మె.వా. అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కూడా ఉంది. అదానీ సంస్థ పెట్టనున్న రూ.60 వేల కోట్ల పెట్టుబడుల్లో ఇది కూడా ఓ భాగం.