ఎపి నుంచి హజ్ యాత్రకు 1201 మందిని హజ్ కమిటీ ఛైర్ పర్సన్ గౌస్ లజామ్ లాటరీ ద్వారా ఎంపిక చేశారు. మొత్తం 1416 మంది అప్లికేషన్లు పెట్టుకోగా వీరిలోంచి 1201 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన వారందరూ వారి వారి పాస్పోర్టులను, ఆరోగ్య, ఫిట్నెస్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంది. దాంతో పాటు రూ.81 వేల పే ఇన్ స్లిప్స్ను సైతం వారు సబ్మిట్ చేయాల్సి ఉంది. ఎంపికైన వారి లిస్ట్ కోసం htpps://apstatehajcommittee.com లో చెక్చేసుకోవచ్చు.