ఆంధ్రప్రదేశ్లో గతేడాది పురుగు మందుల వాడకం గణనీయంగా తగ్గిందని కేంద్రం ప్రకటించింది. అంతకు ముందు దేశంలోనే అత్యధిక స్థాయిలో పురుగుమందులు వాడుతున్న రాష్ట్రంగా ఉన్న ఎపి.. 2020–21 ఏడాదిలో ఈ విషపూరిత మందుల వాడకాన్ని బాగా తగ్గించుకుంది. 2016–17 తో పోల్చితే గతేడాది 23 శాతం తగ్గిందని పేర్కొంది. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల్లో ఈ పురుగు మందుల వాడకం సరాసరి 7 శాతం మేర పెరిగిందని పేర్కొంది.