రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ళకు సిద్ధమవుతోంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి యూనిట్ రూ.2.49 చొప్పున 7 వేల మె.వా. విద్యుత్ను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఎస్ఈసిఐ 2024 సెప్టెంబర్ నాటికి 3 వేల మె.వా.ల సోలార్ను విద్యుత్ను ఎపికి అందించనుంది. 2025 నాటికి మరో 3 వేల మెగా వాట్లు, 2026 సెప్టెంబర్ నాటికి మరో 1000 మె.వాట్లు అందించనుంది.