మోదీ : భూపాల్​ రెడ్డి గారూ.. మీ సేవలు అమోఘం

By udayam on May 30th / 5:33 am IST

ప్రధాని మోదీ తన మన్​కీ బాత్​ కార్యక్రమంలో ఎపికి చెందిన టీచర్​ రామ్​ భూపాల్​ రెడ్డిని గుర్తు చేసుకున్నారు. రిటైర్మెంట్​ అనంతరం ఆయనకు వచ్చిన డబ్బునంతటినీ బాలికల విద్యకు కేటాయించినందుకు గానూ మోదీ భూపాల్​ రెడ్డి టీచర్​ను అభినందించారు. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు గ్రామంలో ఓ స్కూలుకు ఆయన ప్రిన్సిపల్​గా ఉండి రిటైర్​ అయ్యారు. ఈ క్రమంలో ఆయనకు వచ్చిన రూ.25.71 లక్షలను 88 మంది బాలికల విద్య కోసం సుకన్య సమృద్ధి యోజన స్కీంలో 10 ఏళ్ళ కాలానికి ఖాతాలు తెరిచారు.

ట్యాగ్స్​