ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం 6 లైన్ల ఎక్స్ప్రెస్ హైవేను అదనంగా కేటాయించింది. రాష్ట్రంలోని కర్నూలును మహారాష్ట్రలోని షోలాపూర్కు కలుపుతూ ఈ ఆరు లైన్ల హైవే నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోడ్డు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల మీదుగా 318 కి.మీ.ల మేర నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం డిపిఆర్ సిద్ధమవుతోంది.. భారత మాల ప్రాజెక్ట్ రెండో దశలో భాగంగా ఈ రోడ్డును రూ.12 వేల కోట్లతో నిర్మిస్తున్నారు.