నెల్లూరులో రుయా ఘటన..

By udayam on May 5th / 7:37 am IST

తిరుపతి రుయాలో ఘటనను మరవక ముందే నెల్లూరు జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. సంగం చెరువులో నీట మునిగిన శ్రీరామ్​ అనే 10 ఏళ్ళ చిన్నారి మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి తరలించడానికి 108 సిబ్బంది నిరాకరించారు. నిబంధనలు ఒప్పుకోవంటూ వారు శవాన్ని తీసుకెళ్లడానికి ముందుకు రాలేదు. దీంతో చేసేది లేక చిన్నారి తండ్రి తన ద్విచక్ర వాహనంపైనే మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్ళాడు. ఈ ఘటనపై టిడిపి అధికారిక ట్విట్టర్​ ఖాతాలో అధికార పార్టీపై విమర్శలు గుప్పించింది.

ట్యాగ్స్​