ఒడిశా రాష్ట్రంలో మరో రష్యన్ జాతీయుడు శవంగా తేలాడు. 51 ఏళ్ళ మిల్యాకోవ్ సెర్గీ బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ పోర్ట్ నుంచి బయల్దేరిన ఇతడు పారాదీప్ మీదుగా ముంబైకి ఎంబి అల్ద్ నాహ్ ఓటులో ప్రయాణమయ్యాడు. ఈ బోట్ కు చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఇతడు మంగళవారం ఉదయం 4.30 గంటలకు ఛాంబర్ లో అచేతన స్థితిలో పడి ఉన్నట్లు బోటులోని సిబ్బంది గుర్తించారు. గత డిసెంబర్ లో రష్యన్ పార్లమెంట్ సభ్యుడితో పాటు మరొకరు ఒడిశాలోని ఓ హోటల్ లో శవంగా తేలిన విషయం తెలిసిందే.