పోలాండ్ రాజధాని వార్సాలో జరిగిన రష్యా విక్టరీ పరేడ్లో ఆ దేశ రాయబారికి తీవ్ర అవమానం జరిగింది. ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండిస్తూ నిరసనకారులు రష్యా రాయబారిపై రెడ్ సిరాను చల్లి తమ నిరసనను తెలిపారు. ఆయనతో పాటు ఆయన సిబ్బందిపైనా ఈ రెడ్ ఇంక్ పడ్డ వీడియో వైరల్ అవుతోంది. రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికులకు నివాళులర్పించే క్రమంలో ఆయనపై ఈ దాడి జరిగింది.