అమలాపురం అల్లర్లలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వైకాపా కార్యకర్త అన్యం సాయితో పాటు 46 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి విశ్వరూప్కు అనుచరుడుగా ఉంటున్న అన్యం సాయి.. మిగతా పార్టీల ముఖ్య నేతలతోనూ మంచి సంబంధాలే ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 24న కోనసీమ సాధన సమితి ఆందోళనల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటానంటూ అతడు చేసిన హల్చల్ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రౌడీ షీట్ ఉన్న అతడిపై తాజాగా అల్లర్లకు కారణమంటూ మరో కేసు నమోదైంది.