విశాఖలో సోము వీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. కర్మయోగి ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన సోము వీర్రాజును లోపలికి వెళ్లకుండా గేట్ వద్ద సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. అది గమనించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లి చెప్పడంతో సిబ్బంది అనుమతించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినైన తనను లోపలకు పంపించరా? అంటూ సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. దీన్ని గమనించిన కిషన్ రెడ్డి ఆయనను లోపలకు అనుమతించమని చెప్పడంలో వీర్రాజును లోపలకు పంపించారు. దీంతో సోము శాంతించారు.
రోఙ్గార్ మేళలో భాగంగా దేశమంతటా 45 స్థానాల్లో 71,056 మందికి ప్రధాని నరేంద్రమోదీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలను అందచేసారు.
రాష్ట్రంలో చేపట్టిన రోఙ్గార్ మేళ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి శ్రీ @kishanreddybjp గారు మరియు పార్టీ నాయకులు శ్రేణులతో పాల్గొన్నాను. pic.twitter.com/h5aRomvO5C
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) November 22, 2022