అసాని తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన సహాయక చర్యలను వేగవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. తీర ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అవసరమైన ఆహారం, షెల్టర్ను ఏర్పాటు చేయాలన్నారు. సహాయ శిబిరాల్లో ఒక్కో వ్యక్తికి రూ.1000, కుటుంబాలకు రూ.2 వేలు చొప్పున ఆర్ధిక సాయం ఇవ్వాలన్నారు.