జగనన్న శాశ్వత భూహక్కు పథకాన్ని ప్రారంభించిన సిఎం

By udayam on November 23rd / 11:37 am IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీని సిఎం వైఎస్​ జగన్​ ఈరోజు ప్రారంభించారు. రాష్ట్రంలో దాదాపుగా 17,584 రెవెన్యూ గ్రామాలు ఉంటే అందులో మొదటి దశలో ఈ రోజు నుంచి మరో 15 రోజుల్లోనే 2 వేల గ్రామాల్లోని రైతులందరికీ కూడా భూ హక్కు పత్రాలను అందజేస్తున్నామన్నారు. రెండో దశ ఫిబ్రవరి 2023 మరో నాలుగు నెలల కాలంలో మరో నాలుగు వేల గ్రామాల రైతులకు వారి భూ హక్కు పత్రాలు అందిస్తమన్నారు.మే నెల నుంచి మూడో దశ, ఆగస్ట్​ నుంచి 4వ దశలో కలిపి మొత్తం 15 వేల గ్రామాల రైతులకు భూ హక్కు పత్రాలు అందిస్తామన్నారు.

ట్యాగ్స్​