దావోస్​ చేరుకున్న సిఎం జగన్​

By udayam on May 21st / 5:13 am IST

ఎపి సిఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి 11 రోజుల సుదీర్ఘ పర్యటన నిమిత్తం యూరప్​ చేరుకున్నారు. ముందుగా స్విట్జర్లాండ్​లోని దావోస్​లో 22–26 తేదీల మధ్య జరగనున్న ప్రపంచ ఆర్ధిక ఫోరమ్​లో పాల్గొననున్న ఆయన అక్కడ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. సిఎం జగన్​ వెంట మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్​, జి.అమర్​నాథ్​లు సైతం ఉన్నారు. దావోస్​ సదస్సులో ఎపి తన పెవిలియన్​ను సైతం ఏర్పాటు చేసింది.

ట్యాగ్స్​