ఈ ఏడాది జి20 దేశాల అధ్యక్ష బాధ్యతల్లోకి వచ్చిన భారత్ అందుకు తగ్గ ఏర్పాట్ల కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీలో నేడు సమావేశం కానుంది. ఈ మేరకు మన రాష్ట్రం నుంచి సిఎం జగన్ తో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబులు ఈరోజు ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఈరోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రాష్ట్రపతి భవన్ లో ఈ సమావేశం జరగబోతోంది.సిఎం జగన్ ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో 3.15 గంటలకు ఢిల్లీ చేరుకుంటుండగా.. చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీకి పయనమయ్యారు.