ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఇవాళ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమం జరుగుతున్న తీరును సమీక్షించారు. గడపగడపకు ప్రభుత్వంలో వెనుకబడ్డ 32 మంది ఎమ్మెల్యేలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. మార్చిలోగా పనితీరు మార్చుకోవాలని ఎమ్మెల్యేలను సీఎం జగన్ ఆదేశించారు. పనితీరు మార్చుకోకుంటే కొత్త అభ్యర్థులను పెడతానని ఎమ్మెల్యేలను సీఎం జగన్ హెచ్చరించినట్లు సమాచారం.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన వర్క్షాప్.
హాజరైన వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు.#GadapaGadapakuManaPrabhuthvam pic.twitter.com/c2LEfpMcWn
— YSR Congress Party (@YSRCParty) December 16, 2022