టెట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకుల విద్యాలయ సంస్థ అధీనంలో ఉన్న స్కూళ్లు కాలేజీల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలు విభాగాల్లో 317 పోస్టులు ఖాళీగా ఉండగా, ఐటీడీఏలు ఉన్న జిల్లాల్లో ప్రాజెక్టు అధికారుల ఆధ్వర్యంలో, నాన్ ఐటీడీఏల పరిధిలో జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు.