ప్రతిపక్ష నేత చంద్రబాబు రోడ్ షోలలో వరుసగా తొక్కిసలాటలు జరుగుతుండడంతో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్ షోలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్టేట్, మున్సిపల్, పంచాయతీరాజ్ రోడ్లపై కాకుండా ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని సూచించింది. రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీ రాజ్ రోడ్లపై ఎలాంటి రాజకీయ ప్రదర్శనలు వద్దని నిర్ణయించింది. రోడ్లకు దూరంగా, మైదానాల్లో రోడ్డు షోలు నిర్వహించుకోవాలని నిర్ణయించింది.