సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్ను ఎత్తి వేస్తూ ఎపి సర్కార్ ఉత్తర్వులు విడుదల చేసింది. అతడిని తిరిగి సర్వీసులోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది. 2022 ఫిబ్రవరి 8 నుంచి ఏబీవీ సర్వీస్ రీ ఇన్స్ట్రేట్ చేస్తున్నట్లు పేర్కొన్న ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు వరకూ జీఏడీకి రిపోర్ట్ చేయాలని సూచించింది. 2020 ఫిబ్రవరి 8న ఆయనను సర్వీసు నిబంధనలు అతిక్రమించి మరీ నిర్ణయాలు తీసుకున్నారన్న అభియోగాలపై సర్కార్ విధుల నుంచి తొలగించింది.