దేశంలో కరోనా తీవ్రత పెరుగుతందని వస్తున్న నివేదికల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ సర్వసన్నద్ధమవుతోంది. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రజని తమకు అత్యవసరంగా కొవిడ్ వ్యాక్సిన్లను పంపాలని కేంద్ర మంత్రిని కోరారు. ప్రస్తుతం తమ వద్ద కేవలం 47 వేల కొవిడ్ వ్యాక్సిన్లు మాత్రమే ఉన్నాయన్న ఆమె.. అవి త్వరలోనే నిండుకుంటాయని, కాబట్టి అత్యవసరంగా వ్యాక్సిన్ల సరఫరా చేయాలని పేర్కొన్నారు.