ఇప్పటం గ్రామస్థులకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్ట్ ను తప్పుపట్టించారంటూ 14 మందికి ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా విధించింది. ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతపై గతంలో హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తమకు నోటీసులు ఇవ్వలేదని రైతుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తాము నోటీసులు ఇచ్చిన తరువాతనే కూల్చేశామని ఇటీవల విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. దీంతో కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు 14 మంది రైతులకు కోర్ట్ జరిమానా విధించింది.