సైక్లోన్ అసాని విరుచుకుపడుతున్న నేపధ్యంలో నేడు జరగాల్సిన ఇంటర్ తొలి ఏడాది పరీక్షను ఈనెల 26కు వాయిదా వేస్తూ ఎపి ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు, స్టాఫ్ రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. మిగిలిన పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని పేర్కొంది. సైక్లోన్ అసాని కారణంగా ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో వర్షాలతో పాటు తీవ్ర గాలులు వేస్తున్న నేపధ్యంలో ఈ పరీక్షను వాయిదా వేసింది.