ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా సోషల్ మీడియా ట్రోలింగ్ తో కన్నీటి పర్యంతమయ్యారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈ టాలీవుడ్ సీనియర్ యాక్ట్రెస్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులను కూడా ఈ మధ్య కొందరు కావాలని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీనిపైనే ఆమె స్పందిస్తూ.. ‘నా కూతురు అన్షు మాలిక చాలా సెన్సిటివ్. అలాంటి పిల్లను కూడా ట్రోల్ చేస్తున్నారు. ఆమె ఇది తట్టుకోలేక నన్ను నిలదీస్తోంది. మనకు ఇది అవసరమా? అంటూ నన్ను ప్రశ్నిస్తోంది’ అంటూ రోజా ఆవేదన వ్యక్తం చేశారు.