కోనసీమ జిల్లా పేరు మార్పుపై జరిగిన అల్లర్లు అత్యంత దురదృష్టకరమని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఈ అల్లర్ల వెనుక వైకాపా కౌన్సిలర్ ఉన్నారని, ఈ మేరకు తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ప్రజల్లోకి రౌడీషీటర్లు వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారన్న ఆయన.. నిరసనల్లో కాలిపోయిన తన ఇళ్లు, కార్యాలయాలను పరిశీలించారు. కోనసీమ ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.