ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యార్ధులకు ఈ నెల 11 నుంచి 17వ తేదీవరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ ఓ ప్రకటనలో తెలిపింది. అన్ని ప్రభుత్వ, ప్రవేటు, ఎయిడెడ్, వృత్తిపరమైన విద్యా సంస్థలు ఈ ఆదేశాలను పాటించాలని ఇంటర్మీడియెట్ బోర్డు ఆదేశించింది. 8 వ తేదీన కళాశాలలను తిరిగి ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది.