ఎపిలో రెండు భారీ ప్రాజెక్టులు నిర్మించడానికి అదానీ గ్రీన్ ఎనర్జీ ముందుకొచ్చింది. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్దిక ఫోరమ్ సదస్సులో ఎపి సిఎం జగన్, అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీల మధ్య ఈ మేరకు ఎంఓయూ కుదిరింది. ఇందులో భాగంగా ఎపిలో 3,700 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్లాంట్తో పాటు 10000ల మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణానికి అదానీ ముందుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ల కోసం రూ.60 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు.
దావోస్: 2 మెగా ప్రాజెక్టులపై అదానీ గ్రీన్ ఎనర్జీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ. 3,700 మె.వా. పంప్డ్ హైడ్రో స్టోరేజ్. 10వేల మె.వా. సోలార్ ప్రాజెక్టులకోసం రూ.60 వేల కోట్లు పెట్టుబడి. దాదాపు 10వేలమందికి ఉద్యోగాలు. ముఖ్యమంత్రి వైయస్.జగన్, గౌతం అదానీల సమక్షంలో ఎంఓయూపై సంతకాలు. pic.twitter.com/jQjJBnP31F
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 23, 2022