విద్యార్థి సమస్యల పరిష్కారానికి ఛలో రాజ్​భవన్​

By udayam on May 14th / 5:05 am IST

విద్యార్ధి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎపిలోని స్టూడెంట్​ యూనియన్స్​ ఈరోజు విజయవాడలోని రాజ్​భవన్​ ముట్టడికి పిలుపునిచ్చాయి. సమస్యల పరిష్కారంతో పాటు ఖాళీ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్​ను విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ ఛలో రాజ్​ భవన్​కు సిద్ధమయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాజ్​భవన్​ రోడ్డులో ఆంక్షలు పెట్టారు. రాజ్​భవన్​ పరిసరాల్లో సెక్షన్​ 144, సెక్షన్​ 30 పోలీస్​ యాక్ట్​ అమలులో ఉందని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా ప్రకటించారు.

ట్యాగ్స్​