తమ ఫోన్ల అమ్మకాలతో పాటు ఛార్జర్లను ఇవ్వని కారణంగా యాపిల్, సామ్సంగ్లు భారీ జరిమానాలు చెల్లించనున్నాయి. యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ నుంచి ఫోన్ ఛార్జర్ అమ్మకాలను నిలిపివేయగా సామ్సంగ్ తన గేలాక్సీ ఎస్21 సిరీస్ నుంచి ఛార్జర్లను ఇవ్వడం మానేసింది. దీనిపై బ్రెజిల్ న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. భారీ జరిమానా విధించడానికి సిద్ధమైంది. ఈ కేసు విచారణ దాదాపు పూర్తి కాగా.. తీర్పును రిజర్వ్ చేసింది.