గుడ్​ న్యూస్​: ఐఫోన్స్​ లో 5జి ఫీచర్​

By udayam on December 14th / 12:19 pm IST

యాపిల్ భారత్​ లోని​ తన ఐఫోన్​ యూజర్లకు ఈరోజు గుడ్​ న్యూస్​ చెప్పింది. దేశంలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 5జి ఇంటర్నెట్​ ను తమ ఫోన్లలో వాడుకునేలా సాఫ్ట్​ వేర్​ ను అప్డేట్​ చేసింది. డిసెంబర్ 13 రాత్రి 11:30 గంటలకు జియో , ఎయిర్‌టెల్ కనెక్షన్‌లను వినియోగిస్తున్న ఐఫోన్‌ వినియోగదారులకు 5జీ అప్‌డేట్‌ అందజేసినట్లు యాపిల్‌ స్పష్టం చేసింది. ఐఓఎస్​ 16.2 రిలీజ్‌ కావడంతో.. భారతదేశంలోని వినియోగదారులు కవరేజీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్ స్పీడ్‌ను ఉపయోగించుకోగలుగుతారు. 2020 లేదా తర్వాత విడుదలైన అన్ని ఐఫోన్​ 5G ఫోన్లలో ఇప్పుడు ఈ సపోర్ట్ యాక్టివేట్ అవుతుంది.

ట్యాగ్స్​