ఈరోజే కెరీర్ లో తొలి రంజీ మ్యాచ్ ఆడుతున్న సచిన్ తనయుడు అర్జున్ టెండుల్కర్ అరంగేట్రం మ్యాచ్ లోనే దుమ్ముదులిపేశాడు. బుధవారం రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 178 బాల్స్ లో 100 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. అతడికి సుయాష్ ప్రభుదేశాయ్ (171) నుంచి సహకారం దక్కింది. దీంతో వీరిద్దరూ గోవాను 397/5 స్టేజ్ కు తీసుకొచ్చారు. 2018లో అండర్–19 లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతడు ముంబై తరపున కేవలం కొద్ది మ్యాచ్ లే ఆడి ఇప్పుడు గోవాకు మారాడు.