మా ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలను ఒకేసారి అరెస్ట్ చేసేయాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘నాకొచ్చిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పుడు ఈడీ మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెంట పడుతోంది. నేనిప్పుడు ఈ దేశ ప్రధానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మీ పవర్ అంతటినీ ఉపయోగించి మా పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఒకేసారి అరెస్ట్ చేసేయండి. ఇలా ఒకరి తర్వాత ఒకరు వద్దు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.