భారతీయ అమెరికన్ వ్యోమగామి రాజాచారి 6 నెలల అంతరిక్షయానాన్ని పూర్తి చేసుకుని భూమికి తిరిగొచ్చాడు. అతడితో పాటు శుక్రవారం మొత్తం నలుగురు ఆస్ట్రోనాట్లు గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో సేఫ్ ల్యాండ్ అయ్యారు. స్పేస్ఎక్స్ డ్రాగన్ షిప్లో అమెరికా కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 12.43 గంటలకు వారు తమ 177 రోజుల అంతరిక్ష యానాన్ని ముగించుకుని క్షేమంగా తిరిగొచ్చారు. రాజాతో పాటు కాయ్లా బారన్, టామ్ మర్ష్బర్న్, మతియాస్ మౌరర్లు భూమికి తిరిగొచ్చిన వారిలో ఉన్నారు.