మణిపూర్ లోని నోనే జిల్లాలో బుధవారం మధ్యాహ్నం జరిగిన స్కూల్ బస్సు మాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. ఓల్డ్ చాచర్ రోడ్డులోని లాంగ్ సాయి ప్రాంతానికి దగ్గర్లో ఈ ఘోరం జరిగింది. యాన్యువల్ స్కూల్ స్టడీ టూర్ కోసం బయల్దేరిన తంబైను హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు బయల్దేరిన బస్సు ఓవర్ టర్న్ చేసుకుని రోడ్డుపై తిరగబడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు స్టూడెంట్స్ మరణించగా.. మరికొంత మందికి గాయాలయ్యాయి.